జనగామ జిల్లాలోని శామీర్ పేట్ గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పర్యవేక్షించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటికి ఎంత ఖర్చు అయ్యింది..? నిర్మాణం జరిగిన తీరు, అలాగే సొంత ఇంటి కల నెరవేరడంతో వారి అభిప్రాయాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ఆయనతోపాటు DSCDO విక్రమ్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, తదితరులున్నారు.