MBNR: డీసీసీబీ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలను అనుసంధానం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ రమాకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.