GDWL: కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నెలో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం, నానో ఫెర్టిలైజర్లు, ఆయిల్ పామ్ సాగులోని మెళకువలను వివరించారు. ఆధునిక పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని సూచించారు. డీపీడీ జగ్గు నాయక్, ఏవో రాజవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.