ADB: విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం బజార్ హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.