NZB:పెరిగిన రైలు సర్వీసులతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైల్వేగేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. వాటి స్థానంలో ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలు చేపట్టాలని ఇందల్వాయి, సిర్నాపల్లి, డిచ్పల్లి, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో అధికారులు గతంలో సర్వే పూర్తి చేశారు. కానీ ఇంతవరకు ముందడుగు పడకపోవడంతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడాల్సి వస్తోంది.