NGKL: నల్లమల అటవీ ప్రాంతంలో ఏడాదిలో కేవలం మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే దర్శనమిచ్చే సలేశ్వరం రామలింగేశ్వర స్వామి జాతరకు సంబంధించి ఏర్పాట్లు అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలోని లోయలో రామలింగేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు.