SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 8 -23 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ ప్రకటించారు. ఈ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. అత్యవసరమైతే ఏసీపీ అనుమతి తప్పనిసరి అని వెల్లడించారు. ముఖ్యంగా డీజేల వినియోగంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.