JN: జనగామ పట్టణ 3వ వార్డులో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారని 3వ వార్డు కౌన్సిలర్ జ్యోతి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వెలగని వీధి దీపాలను రిపేర్ చేసి కొత్త లైట్లు అమర్చాలని, కరెంట్ పోల్స్, పైపులకు కొత్త క్యాప్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు గోపి పాల్గొన్నారు.