GDWL: ధరూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇవాళ గ్రామపంచాయతీ పాలకవర్గం అలాగే పంచాయతీ కార్యదర్శులతో 99 రోజుల ప్రజా పాలన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, బోర్ వెల్స్ పునరుద్వర్ధన, ఘన పదార్థాలను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రత, చేపట్టాల్సిన అంశాలపై ప్రణాళిక సిద్ధం చేశారు.