SRCL: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 22న (ఆదివారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో కలిసి గంభీరాపేట్లో బయోస్ట్రాటమ్ బయోగ్యాస్ ప్లాంట్కు భూమిపూజ నిర్వహించి రైతులతో సంభాషిస్తారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది.