SDPT: వ్యాసమహర్షి యోగ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సామూహిక ఆయుర్వేద మడ్ బాత్ కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట కోమటి చెరువు సమీపంలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 80 మంది ఆరోగ్య అభిలాషూలు పాల్గొన్నారు. గో మూత్రం, పాలు, నెయ్యి, తులసి, పసుపు, వేప, నిమ్మ మొదలగు 25 రకాల మూలికలను చెరువు మట్టితో కలిపి మిశ్రమాన్ని ఒంటికి రాసుకొని యోగ చేశారు.