SDPT: నంగునూరు మండలంలోని 12 గ్రామాల అభివృద్ధి కోసం ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి రూ.60 లక్షల నిధులు మంజూరు చేయించారని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి తెలిపారు. మండల కేంద్రంలో సీసీ రోడ్లు, మురికికాలువల కోసం మరో రూ.40 లక్షల నిధులకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. నిధులు కేటాయించిన మంత్రి వివేక్, సీఎం రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.