యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే తిరు కళ్యాణ మహోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. గత 15 ఏళ్లుగా ఆనవాయితీగా ఆయన కుటుంబం వీటిని సమర్పిస్తుంది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.