WNP: హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన సీఎం కప్ తైక్వాండో పోటీల్లో వనపర్తి జిల్లా కొత్తకోట విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జిల్లా నుంచి పాల్గొన్న 27 మందిలో ఇద్దరు రజత, నలుగురు కాంస్య పతకాలు సాధించారు. విజేతలను కొత్తకోట మున్సిపల్ ఛైర్మన్ పి. అరుణ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ పి. పల్లవి కృష్ణారెడ్డి అభినందించారు.