BDK: మణుగూరులోని ఏరియా స్టోర్ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఇవాళ ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని అల్లాహ్ను వేడుకున్నారు.