NLG: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం TPUS నల్లగొండ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా కార్యదర్శి తులసి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా నల్లగొండ ఎంఈఓ కత్తుల అరుంధతి విచ్చేసి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సంఘటిత శక్తితో హక్కులను సాధించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.