KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సూచించారు. మంగళవారం ఆర్టీసీ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బస్సు వెళ్లని గ్రామాలను గుర్తించాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు.