HNK: మోసపూరిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. పెగడపల్లిలో ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతుందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.