KNR: ఆకునూరు పురుషుల పొదుపు సంఘం సభ్యుడు గొల్లపల్లి సతీశ్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆయన నామినీ, భార్య సుమలతకు శనివారం రూ. 84,553 క్లెయిమ్ మొత్తాన్ని సంఘం ప్రతినిధులు అందజేశారు. సామూహిక నిధి, అభయనిధి, పొదుపు, బోనస్ నిధులను కలిపి ఈ సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సమితి సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్, సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి పాల్గొన్నారు.