MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లకు నీటి సరఫరా సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని వార్డు మెంబర్ మధు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సొంత ఖర్చుతో మోటార్ మరమ్మతులు చేయించి బోరు బావిలో దింపించారు. దీంతో నీటి సమస్య పరిష్కారమైంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.