NLG: నేడు చంద్రగ్రహణం కారణంగా కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం ఉ. 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంటాయని ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి తెలిపారు. తిరిగి రేపు (బుధవారం, మార్చి 4) ఉ. 8 గంటలకు ఆలయ సంప్రోక్షణ నిర్వహించి, దర్శనం కల్పిస్తారు.