WNP: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వనపర్తి రూరల్ ఎస్సై హృషీకేశ్ తెలిపారు. వివరాలు నాగవరం తండాకు చెందిన శ్రీనుతో మేఘవత్ జ్యోతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అదనపు కట్నం కావాలని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.