SRCL: వీర్నపల్లి శివారులో ఎస్సై వేముల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు.