NLG: జిల్లా చండూరు పట్టణంలో బీజేపీ కార్య కర్తలపై జరిగిన దాడి ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.