కోనసీమ: రాజోలు మండలంలోని ఒక గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి, తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు తెలిపారు.