MHBD: సీరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామ స్టేజి వద్ద బుధవారం రోడ్డు దాటుతున్న మహిళను టిప్పర్ లారీ ఢీకొనడంతో నాగేటి పద్మ (50) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.