SRCL: తంగళ్ళపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో వార్డు సభ్యులకు ఆదివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేయడంలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రతి వార్డు సభ్యుడు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మీర్జా, వార్డు సభ్యులు కీర్తన, పద్మ తదితరులు పాల్గొన్నారు.