SRPT: సూర్యాపేట విద్యుత్ సర్కిల్ ఆఫీసు ఎదుట మీటర్ రీడర్ల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్నా పీస్ రేటు విధానంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 30 రోజుల పని దినాలు కల్పించాలని, జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యలు పరిష్కారం కాకపోతే విధులకు హాజరుకామని అన్నారు.