మెదక్: నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ నరేందర్ ఆధ్వర్యంలో 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో పారిశుధ్య పనులను పర్యవేక్షించి, దోమల నివారణకు పరిసరాలను పొడిగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్థులకు వివరించారు.