HYD: హోలీ వేళ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరే వలల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ప్రజలను హెచ్చరించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే ఉచిత బహుమతులు, భారీ డిస్కౌంట్ల వంటి నకిలీ లింకులు, ప్రమాదకరమైన (APK) ఫైళ్లను క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు. అలా చేస్తే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు.