MDK: మాసాయిపేట మండలం బొమ్మారంకు చెందిన మెట్టెల నాగరాజు (25) ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిన్న రైల్వే ట్రాక్ పనులకు వాటర్ సప్లయ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ట్రాక్టర్ ట్యాంకరు బోల్తాపడగా నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.