MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 23న చెస్ మెన్ సౌత్ జోన్ ఎంపికలు, ఆలిండియా తైక్వాండో మెన్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ డా. వై. శ్రీనివాసులు తెలిపారు. ఎంపికైన చెస్ క్రీడాకారులు మార్చి 1-5 వరకు తిరుచిరాపల్లి సౌత్ జోన్ పోటీల్లో, తైక్వాండో క్రీడాకారులు మార్చి 2-6 వరకు జలంధర్లో జరిగే ఆలిండియా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.