KKD: కోటనందూరు మండలం కాకరపల్లి శివారు తమ్మయ్య చెరువులో గుర్తు తెలియని మహిళ, సుమారు మూడేళ్ల బాలుడి మృతదేహాలు లభ్యమవ్వడం కలకలం రేపింది. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.