మెదక్: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవానీ మాతను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు ఆలయ మర్యాదాల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.