ADB: ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి రాధాకృష్ణారెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించి ప్రశంస పత్రాలను అందజేశారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.