NZB: ధర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్, ఆదర్శ కళాశాలల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథమెటిక్స్ 1బీ, జువాలజీ పరీక్షలకు మొత్తం 4 విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్స్ శ్రీనాథ్, శ్రీనివాసులు తెలిపారు. ఆదర్శ కళాశాలలో ఒకరు, ప్రభుత్వ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు పరీక్షకు రాలేదని పేర్కొన్నారు.