SRCL: ఎల్లారెడ్డిపేట (M) కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు నుంచి ఉచిత యోగా తరగతులు సామాజిక కార్యకర్త దుంపెన రమేష్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగాసనాలు వేయిస్తామన్నారు. బీపీ, షుగర్, ఒత్తిడితో బాధపడేవారు, సీనియర్ సిటిజన్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిరిసిల్లకు చెందిన యోగ గురువు కృష్ణ హాజరవుతారని తెలిపారు.