PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన మల్యాల రాధమ్మ మృతి అనంతరం కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో సదాశయ ఫౌండేషన్ సహకారంతో ల్యాబ్ టెక్నీషియన్ ప్రదీప్ నేత్రాలను సేకరించారు. కుమారులు శ్రీనివాస్, గణపతి, రాంశంకర్, కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.