KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహణపై సమావేశంలో పాల్గొంటారు. జిల్లాకు చెందిన ఇతర మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.