NRML: ఖానాపూర్ మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గురిజాల నడిపి నరహరి, భూటా శంకర్, చీమల శ్రీకాంత్, బూర్క లక్ష్మణ్, గాదె రమేష్, దాసన్ల శ్రీనివాస్ ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఆరుగురిని పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.