SRCL: రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడమే లక్ష్యమని కలెక్టర్ ఎం. హరిత స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, రవాణా, మార్కెటింగ్, సహకార, ఐకేపీ, మెప్మా ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.