మెదక్ పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిటిజెన్స్ ఫోరం సభ్యులు మున్సిపల్ ఛైర్పర్సన్ రాధికా భూపతిరాజును కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంజినీర్ నితిన్లతో చర్చించగా వారు సానుకూలంగా స్పందించారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఫోరం ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, భూపాల్ రెడ్డి, భుజంగ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.