జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. కాటారం డివిజన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. పోలీసులు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.