NLG: దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో శుక్రవారం ఆర్థిక ఇబ్బందులతో వ్యవసాయ కూలీ తిరుపతి (45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తిరుపతి కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.