MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఆంగ్ల మాధ్యమంలో బోధించే అభ్యర్థులకు నేడు (శనివారం) మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ, డెమోకు హాజరుకావాలని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 10 గంటలకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని పేర్కొన్నారు.