MHBD: నెల్లికుదురు మండలం కాచికల్ స్టేజీ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో 40 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు ఎస్సై రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. గంజాయి సేవిస్తున్న తొర్రూరుకు చెందిన వేల్పుల సుమంత్, గోపాలగిరికి చెందిన ధర్మారపు వంశీ పట్టుబడ్డారు. గంజాయి విక్రయానికి సంబంధించి నెల్లికుదురుకు చెందిన సందీప్ పరారీలో ఉండగా, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.