JN: తండాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలంలోని పలు తండాలలో ఎమ్మెల్యే పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గతంలో అధికారంలో ఉన్న వారు తండాలను పట్టించుకోలేదని, తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు.