BHNG: CITU జిల్లా కమిటి సమావేశం భువనగిరి పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేదిగా, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని విమర్శించారు.