MDK: నర్సాపూర్ మండలంలో చిన్న చింతకుంటలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వారం క్రితమే పెళ్లయిన భవాని(19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి ఇష్టం లేకే ఆమె మృతి చెందినట్లు అత్తింటి వారు చెబుతుండగా, అదనపు కట్నం కోసం వేధించి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.