ADB: బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలో జరిగిన సద్గురు శబరిమాత ఆశ్రమ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. శబరిమాత భక్తుడిగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు భక్తి మార్గంలోనే నడవాలని ఆన్లైన్ యుగాలకు పిల్లల్ని దూరం ఉంచాలని అన్నారు.